జనంలోకి జనసేనాని పవన్ కళ్యాణ్

మరిన్ని వార్తలు

సార్వత్రిక ఎన్నికలు నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్ళేందుకు అడుగులు వేస్తున్నాడు, అందులో భాగంగానే రేపటి నుండి జనంలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నాడు. 

ముందుగా విజయనగరంలో ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్, ఉస్మానియా యూనివర్సిటీలో తనువు చాలించిన మురళి అలాగే కృష్ణా నదిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలని పరామర్శించనున్నాడట. యువత బలిదానాలు చేసుకోవడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వీటికి బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశాడు.

ఆ తరువాత మరో రెండు విడతలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని సమస్యల పరిష్కారానికి జనంలోకి వెళ్ళేందుకు సిద్ధం అని చెప్పారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయని పక్షంలో తమ జనసేన వారిని ప్రశ్నిస్తుంది అని తేల్చిచెప్పారు.

మొత్తానికి విమర్శకులకి సమాధానం చెప్పేలా ఆయన పర్యటనలు ఉండబోతున్నాయి అని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS