ప్రగ్యాకి నాగ్‌ బంపర్‌ ఆఫర్‌!

మరిన్ని వార్తలు

నాగార్జున సరసన 'ఓం నమో వెంకటేశాయ' సినిమాలో నటించిన అందాల భామ ప్రగ్యా జైస్వాల్‌ తెలుగులో పలు సినిమాలతో ఇప్పుడు చాలా బిజీగా ఉంది. 'గుంటూరోడు' సినిమాలోనూ, 'నక్షత్రం' సినిమాలోనూ నటిస్తున్న ఈ అందాల భామకి, 'ఓం నమో వెంకటేశాయ' మేకింగ్‌ టైమ్‌లోనే నాగార్జున బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారట. ఆ ఆఫర్‌ ఏంటంటో, నాగార్జున తదుపరి సినిమాలో నటించే ఛాన్స్‌. ఓ వైపు నాగచైతన్య, అఖిల్‌ చేయబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉంటోన్న నాగార్జన, ఇంకో వైపున తన కోసం కూడా ప్లానింగ్స్‌ చేసుకుంటున్నారు. అదే నాగార్జున ప్రత్యేకత. నాగచైతన్య రెండు సినిమాలతో లైన్‌లోనే ఉన్నాడిప్పుడు. అఖిల్‌ కూడా వరుసగా సినిమాలు చేయబోతున్నాడు. కాబట్టి నాగార్జున కూడా అతి త్వరలోనే కొంచెం ఫ్రీ అవుతాడు. తదుపరి సినిమాలపై దృష్టి పెడుతున్న నాగార్జున, ఓ ప్రముఖ దర్శకుడితో సినిమా చేయడానికి దాదాపుగా ఓకే చెప్పాడని సమాచారమ్‌. ఆ సినిమాలోనే నాగార్జున సరసన ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించనుందట. 'కంచె' సినిమాతో తెలుగు తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ ఆచి తూచి సినిమాలకు కమిట్‌ అవుతుంది. ఎన్ని సినిమాలు చేశామన్న లెక్క కన్నా, ఎలాంటి సినిమాలు చేశామన్న ఆలోచనతోనే ఆమె ఈ జాగ్రత్తలు తీసుకుంటోందట. అందుకే ఆమె నుంచి 'కంచె', 'ఓం నమో వెంకటేశాయ' లాంటి సినిమాలొస్తున్నాయి. అలాగే కమర్షియల్‌ స్టామినా చాటేందుకు, మాస్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకునేందుకు 'గుంటూరోడు' లాంటి సినిమాల్నీ ఎంచుకుంటోంది ప్రగ్యా జైస్వాల్‌.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS