కృష్ణవంశీ సినిమా రంగమార్తాండ... ఉగాది పర్వదినం పురస్కరించుకొని బుధవారం విడుదలైంది. ఈ సినిమాకి పాజిటీవ్ బజ్ రావడంతో.. థియేటర్ల దగ్గర ప్రేక్షకులు కనిపించారు. మరీ... హౌస్ ఫుల్స్, భారీ వసూళ్లు లేవు కానీ, ప్రస్తుతానికైతే `రన్` బాగానే ఉంది. ఈసినిమా ప్రమోషన్లు అంతంత మాత్రంగానే జరిగాయి. ప్రివ్యూలు, వాటి వల్ల వచ్చిన పాజిటీవ్ టాక్ తో... మౌత్ పబ్లిసిటీ వచ్చింది. కృష్ఱవంశీ కేవలం వీటిపైనే ఆధారపడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రకాష్ రాజ్,బ్రహ్మానందం, రమ్యకృష్ణ.. ఇలా చాలామంది స్టార్లు ఈ సినిమాలో ఉన్నారు. కానీ వాళ్లందరినీ ఒక చోటకు చేర్చలేకపోయాడు కృష్ణవంశీ.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రకాష్ రాజ్కీ, కృష్ణవంశీకీ మధ్య విబేధాలు వచ్చాయని టాక్. ఇద్దరికీ మాటల్లేవని, అందుకే ప్రకాష్ రాజ్ ని కృష్ణవంశీ ప్రమోషన్లకు రప్పించలేకపోయాడని తెలుస్తోంది. విడుదలకు ఒక్క రోజు ముందు ఈ పరిస్థితుల్లో మార్పు కనిపించింది. మంగళవారం టీమ్ అందరినీ తీసుకొచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టాడు కృష్ణవంశీ. ఈ ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ తో సహా టీమ్ అంతా కనిపించింది. అంతే కాదు.. ప్రకాష్రాజ్ కొన్ని టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. దాంతో ప్రకాష్ రాజ్, కృష్ణవంశీ మధ్య గ్యాప్ ఫిల్ అయినట్టే అనిపిస్తోంది. రిలీజ్కి ముందే ఈ సినిమాకి పాజిటీవ్ బజ్ రావడం, ప్రకాష్ రాజ్ పాత్ర హైలెట్ అవ్వడంతో.. ప్రకాష్ రాజ్ దిగి రాక తప్పలేదన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. అదేదో... వారం, పది రోజుల ముందే ప్రకాష్ రాజ్ ప్రమోషన్లకు వచ్చి ఉంటే... ఈ సినిమాకి మరింత బజ్ వచ్చేది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ప్రకాష్రాజ్ మెత్తబడడంతో సినిమాకి మంచే జరిగింది.