Waltair Veerayya: మైత్రీ చెబుతున్న లెక్కలే నిజమైతే.. కోట్ల లాభాలు

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ సునామీ కొనసాగుతోందని నిర్మాతలు చెబుతున్నారు. కేవలం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 108 కోట్లకు పైగా వసూలు చేసిందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. వాల్తేర్ వీరయ్య ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌లోకి ప్రవేశించి భారీ లాభాలను అందించే అవకాశం వుందని నిర్మాతల మాట.

 

ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. తొలిరోజునే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలెట్టింది. . చిరంజీవితో పాటు రవితేజ కూడా తోడవడంతో చిత్రానికి కలిసొచ్చింది. మూడు రోజుల్లోనే 108 కోట్లు అంటే.. ఇదొక రికార్డ్ బ్రేకింగ్ నెంబరనే చెప్పాలి. మొత్తానికి సంక్రాంతికి రెండు భారీ సినిమాలు తీసుకొచ్చిన మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం ప్రకటిస్తున్న లెక్కలలే నిజమైతే రూపాయికి నాలుగు రూపాయిలు వెనక్కి వేసుకునేల కనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS