బాలయ్య - పూరీ ఎన్ని కథలు?

మరిన్ని వార్తలు

నందమూరి బాలకృష్ణ, పూరీ జగన్నాధ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 16 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, సెప్టెంబర్‌ 29కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని పూరీ చెప్పారు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కథ విషయంలో ఇప్పుడంతా ఆశక్తి నెలకొంది. గతంలో పూరీ జగన్నాధ్‌ మెగాస్టార్‌ చిరంజీవి కోసం ఓ స్టోరీ ప్రిపేర్‌ చేశారు. దానికి 'ఆటో జానీ' అని టైటిల్‌ కూడా పెట్టారు. అదే కథని ఇప్పుడు బాలయ్యతో తెరకెక్కిస్తున్నాడంటూ ఓ వర్గం అంటోంది. అయితే మహేష్‌కి 'జనగణమన' టైటిల్‌తో మరో కథ వినిపించాడు. ఆ కథ, ఇప్పుడు బాలయ్యతో తెరకెక్కిస్తున్నాడంటూ మరో వర్గం వాదిస్తోంది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పూరీ బాలయ్య కోసమే ప్రత్యేకించి ఓ పవర్‌ఫుల్‌ స్టోరీని ప్రిపేర్‌ చేశారు. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' టైంలోనే ఆ కథని బాలయ్యకి వినిపించగా, బాలయ్య మెచ్చి, పూరీతో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని అంటున్నారు. అయితే ఏది ఏమైనా ఈ కాంబినేషన్‌ తెరపైకి వచ్చినప్పట్నుంచీ కథ విషయంలో పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే పూరీ జగన్నాధ్‌ నోరు విప్పాలి. అయితే పూరీ మాత్రం బాలయ్య సినిమాలో ఉండాల్సిన అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి.. అని మాత్రమే చెబుతున్నారు. కానీ కథ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఏమో చూద్దాం. బాలయ్య వంటి స్టార్‌ హీరోతో పూరీ చేయబోయే మ్యాజిక్‌ ధమాకా ఎలా ఉండబోతోందో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS