మూగ జీవుల కోసం 'రకుల్'!

మరిన్ని వార్తలు

టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా రకుల్ ఒకటి రెండు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇలా అన్ని భాషల్లో నటిస్తూ తనకంటూ కొంత క్రేజ్ సంపాదించుకుంది. ఇంతే కాకుండా రకుల్ సామాజిక కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొంటుంది. ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన రకుల్ సొంత జిమ్ ఫ్రాంచైజ్ స్థాపించి.. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల సలహాలు, సూచనలు ఇస్తూ అవగాహన పెంచడం లో తనవంతు కృషి చేస్తుంది. ఇప్పుడు తాజాగా రకుల్.. 'పెట' అనే అంతర్జాతీయ 'పశు హక్కుల' సంస్థను ప్రమోట్ చేసే అవకాశం దక్కించుకుంది.

 

అమెరికాకు చెందిన ఈ సంస్థ.. ప్రపంచ వ్యాప్తంగా పశువుల హక్కుల కోసం పోరాడుతుంది. అలాంటి ఈ సంస్థ ఇప్పుడు మన రకుల్ ను ఎంచుకోవడం తో.. సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లాక్ డౌన్ తరువాత ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా పెట తరుపున క్యాంపెయిన్ చేయనున్నట్టు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే రకుల్... కమల్ హాసన్ 'ఇండియన్ 2' లో నటించనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS