భ్రమరాంబకి నచ్చేశాడోచ్‌

మరిన్ని వార్తలు

'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమా తాజా ఆడియో సింగిల్‌ విడుదలైంది. 'భ్రమరాంబకి నచ్చేశాను' అంటూ సాగే ఆ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సినీ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పాట గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ నుంచీ కూడా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌లో కంపోజ్‌ చేసిన పాటలు విన సొంపుగా ఉన్నాయి. ఇప్పటికే టైటిల్‌ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన ఈ సాంగ్‌ అయితే కిర్రాక్‌ పుట్టిస్తోంది. నాగచైతన్య - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్నారు ఈ సినిమాలో. ప్రోమోస్‌లో నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెయిర్‌ చూడముచ్చటగా ఉంది. తెలుగు సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ, సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాన్ని తెరకెక్కించినట్లే అనిపిస్తోంది. ఇప్పటిదాకా విడుదలైన ఆడియో సింగిల్స్‌ అన్నిటికీ మంచి పేరొచ్చింది. కళ్యాన్‌ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగార్జున ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అచ్చమైన తెలుగు చిత్రంగా ఈ సినిమాని ఎంతో అందంగా, ఆహ్లాదంగా రూపొందించారనీ ప్రోమోస్‌, పోస్టర్స్‌ చూస్తుంటేనే అర్ధమవుతోంది. ట్రైలర్‌ అంచనాల్ని రెట్టింపు చేస్తోంది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది 'రారండోయ్‌ వేడుక చూద్దాం'.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS