బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ కొట్టేసిన శ్రీవల్లి

మరిన్ని వార్తలు

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మంచి జోరు మీద ఉంది. వరస అవకాశాలు అందుకుంటూ అన్ని భాషల్లో  సత్తా చాటుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా 'యానిమల్' సినిమాతో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా పుష్ప 2 తో ప్రెక్షకుల  ముందుకు రానుంది. ఇవి కాక ఒక వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ, ఇంకో వైపు కమర్షియల్ సినిమాల్లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ధనుష్ నటిస్తున్న కుబేర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక . శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అతనితో వర్క్ చేయటం హీరోయిన్స్ కి ఒక అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు.                 


యానిమల్ సినిమాతో వచ్చిన గుర్తింపుతో రష్మికకి బాలీవుడ్ లో పలు ఆఫర్స్ వస్తున్నాయని టాక్. ఇప్పుడు కూడా  అలాంటి లక్కీ ఛాన్స్ ఒకటి రష్మికకి లభించింది.  బాలీవుడ్ కండల  వీరుడు సల్మాన్ ఖాన్ తో కోలీవుడ్ డైరక్టర్  మురుగ‌దాస్ ఒక సినిమా కమిట్ అయినట్టు ఎప్పటినుంచో వింటున్నాం. ఈ మూవీలో మొదట త్రిష హీరోయిన్గా నటిస్తుంది అని ప్రచారం జరిగింది. తరవాత సమంత పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఈ ఆఫర్ రష్మికని వరించింది.  ఈ విషయాన్ని శ్రీవల్లి స్వయంగా పేర్కొంది. తన' X 'ఖాతా ద్వారా ఈ న్యూస్ ఫాన్స్ తో పంచుకుంది. సల్మాన్ మురుగుదాస్ కాంబోలో వస్తున్న సికింద‌ర్‌ మూవీలో తాను నటిస్తున్నట్టు షేర్ చేసింది. 


రష్మిక యానిమల్ మూవీకి ముందు కొన్ని బాలీవుడ్ సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాలేదు.  కానీ పుష్ప, యానిమల్ సినిమాలతో బాలీవుడ్ లో ఫామ్ లోకి వచ్చింది. దీనితో సల్మాన్ లాంటి స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. మురుగుదాస్ ఒకప్పుడు ఫుల్ ఫామ్ లో ఉండేవాడు, తన సినిమాల్లో కూడా హీరోయిన్స్ కి చాలా ప్రధాన్యత ఉంటుంది. సో రష్మిక జాక్ పాట్ కొట్టినట్టే. ఈసినిమాతో  బాలీవుడ్ లో రష్మిక హవా మొదలవుతుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS