ఎన్టీఆర్‌ సరసన రష్మిక: ఫిక్సయ్యిందా.?

మరిన్ని వార్తలు

ఇటీవలే టాలీవుడ్‌లో వన్‌ ఆఫ్‌ ది స్టార్‌ హీరో మహేష్‌తో 'సరిలేరు..'లో జత కట్టిన రష్మిక తదుపరి అల్లు అర్జున్‌తో జోడీ కడుతున్న సంగతి తెలిసిందే. ఈ లోగానే మరో క్రేజీ ఆఫర్‌ రష్మిక తలుపు తట్టినట్లు తెలుస్తోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌కి జోడీగా రష్మిక నటించనుందని తాజా సమాచారం. ఇంతకీ ఏ సినిమా కోసం అంటారా.? 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా తర్వాత ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా రూపొందనుందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఈ ప్రాజెక్ట్‌ ఫైనల్‌ అనీ తెలుస్తోంది.

 

ఈ సినిమా కోసమే రష్మికను హీరోయిన్‌గా అనుకుంటున్నారట. 'సరిలేరు..' లో తనదైన మ్యానరిజమ్‌తో 'మీకు అర్ధమవుతోందా.?' అంటూ రష్మిక యూత్‌ మనసుల్ని మరోసారి క్రేజీగా దోచేసింది. అలాగే అల్లు అర్జున్‌ సినిమాలో నటిస్తుందంటే, ప్రస్తుతం క్రేజీయెస్ట్‌ బ్యూటీస్‌లో పూజా హెగ్దే తర్వాత రష్మిక పేరే చెప్పుకోవాలి. అదీ కాక, ఎన్టీఆర్‌ - రష్మిక జంటలో ఫ్రెష్‌నెస్‌ ఉంటుంది. ఇన్ని ప్లస్‌ పాయింట్స్‌ ఉండడంతో రష్మికనే ఫైనల్‌ చేశారనీ తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి. ఒకవేళ ఇదే నిజమైతే, రష్మిక మరో జాక్‌పాట్‌ కొట్టినట్లే. 'అల వైకుంఠపురములో' సినిమాతో హిట్‌ కొట్టి మాంచి జోష్‌ మీదున్నాడు త్రివిక్రమ్‌. అలాంటి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌తో వర్క్‌ చేస్తే రష్మిక ఖాతాలో మరో సక్సెస్‌కి చోటిచ్చినట్లే కదా. మరోవైపు రష్మిక నటించిన 'భీష్మ' ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సినిమాలో నితిన్‌తో రష్మిక జోడీ కడుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS