పవర్ ఫుల్ టైటిల్ తో సల్మాన్ - మురుగుదాస్ కాంబో

మరిన్ని వార్తలు

ప్రస్తుతం సినిమా అంటే సౌత్ ఇండస్ట్రీ అనేలా ఉంది. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ లు వరుసగా సక్సెస్  సాధిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో వసూళ్లు  సాధిస్తున్నాయి. పెట్టిన బడ్జెట్ కి డబుల్ వసూల్ చేసి ఔరా అనిపిస్తున్నాయి. దీనితో బాలీవుడ్ ఇండస్ట్రీ సౌత్ డైరెక్టర్స్, కథలపై ఆసక్తి చూపిస్తోంది. సౌత్ లో ఒక చిన్న ఛాన్స్ వచ్చినా నటించటానికి రెడీగా ఉన్నారు. రీసెంట్ గా అట్లీ దర్శకత్వంలో వచ్చిన 'జవాన్' షారుఖ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సందీప్ వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ రణభీర్ కి వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చి 600 కోట్లు వసూల్ చేసింది. దీనితో రణబీర్ మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. ఇప్పుడు సల్మాన్ కూడా సౌత్ డైరక్టర్ పై డిపెండ్ అయ్యాడు. కోలీవుడ్ డైరక్టర్ ఏఆర్. మురుగదాస్ తో ఒక సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


సౌత్ లో ఒకప్పుడు మురుగుదాస్ మంచి ఫామ్ లో ఉండేవాడు. గత కొంత కాలంగా కెరియర్ కొంచెం డౌన్ అయ్యింది. దీనితో కోలీవుడ్ స్టార్స్ ఎవరూ మురుగు దాస్ కి ఛాన్స్ లు ఇవ్వటం లేదు. ఇప్పుడు సల్మాన్ తో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. ఈ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుని మురుగు దాస్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. రంజాన్ సందర్భంగా సల్మాన్, మురుగుదాస్ కాంబో మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు 'సికందర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సాజిద్ నదియద్ వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ 2025 రంజాన్ కి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. 


ఈ మూవీలో మొదట చెన్నై చంద్రం త్రిషని హీరోయిన్ గా అనుకున్నారు. అప్పుడెప్పుడో 'కట్టా మీఠా' సినిమాలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన త్రిష మళ్ళీ సల్మాన్ మూవీతో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుందని అనుకున్నారు. కానీ తరవాత ఈ మూవీలో త్రిష నటించటం లేదని తెలుస్తోంది. కచ్చితంగా సౌత్ హీరోయిన్ నటిస్తుంది అని టాక్ వినిపిస్తోంది. సమంత పేరు కూడా ఇందులో ఉంది. ఫైనల్ గా సల్మాన్ కి జోడీ గా ఎవరు నటిస్తారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS