డైరెక్టర్ క్రిష్ కు సింగీతం శ్రీనివాస రావు రాసిన బహిరంగ లేఖ!

మరిన్ని వార్తలు

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు తాజాగా ప్రముఖ డైరెక్టర్ క్రిష్ కి ఒక బహిరంగ లేఖ రాశారు.

అయితే ఈ లేఖ రాయడానికి ముఖ్య కారణం, యువకళావాహిని వారు ఏటా ప్రకటించే కేవీ రెడ్డి అవార్డుని ఈ సంవత్సరానికి గాను క్రిష్ అందుకున్నారు. ఈ సందర్భంగా క్రిష్ ని అభినందిస్తూ అలానే అతనలో ఒక డైరెక్టర్ కి ఉండాల్సిన మూడు గుణాలు- స్పష్టత, బాధ్యత, పవిత్రత పుష్కలంగా ఉన్నాయి అని కొనియాడారు.

ఈ లేఖకు క్రిష్ స్పందిస్తూ- ఈ లేఖను జీవితాంతం  తనకు గుర్తుండిపోయే ఒక తీపి గుర్తుగా అభివర్ణించారు. ఈ అవార్డు ప్రధానోత్సవానికి మాజీ గవర్నర్ రోశయ్య గారు, ప్రముఖ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, మాటల రచయత సాయి మాధవ్ బుర్రా తో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా హాజరయ్యారు.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS