‘సోలో బ్రతుకే సో బెటర్‌’తో అసలు సిసలు పరీక్ష

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరవ్‌ు తేజ్‌ తన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విషయం విదితమే. కోరోనా తర్వాత సినిమా హాళ్ళలో విడుదలయ్యే తొలి సినిమా ఇది. ఈ రిలీజ్‌ కోసం ఇటు సినీ ప్రముఖుల, అటు ప్రేక్షకులూ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తొమ్మిది నెలల తర్వాత సినిమా ది¸యేటర్లలో ప్రేక్షకులు సినిమా చూసే అవకాశం రాబోతోంది. అదీ కరోనా భయాందోళనల నడుమ. ‘సెకెండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం వుంది’ అనే కరోనా హెచ్చరికల నడుమ, డిసెంబర్‌లో నిజంగానే ఈ సినిమా ది¸యేటర్లలో విడుదలవుతుందా.? లేదా.? అన్న విషయమై సస్పెన్స్‌ ఇంకా అలాగే వుంది. మరోపక్క ‘జీ’ సంస్థ, ఈ సినిమా రిలీజ్‌ హక్కుల్ని సొంతం చేసుకోవడం మరో ఆసక్తికరమైన పరిణామం. ఒకవేళ సినిమా ది¸యేటర్లలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా విడుదలై, హిట్టు కొడితే మాత్రం.. సాయి ధరవ్‌ు తేజ్‌ కెరీర్‌లోనే దీని వెరీ వెరీ స్పెషల్‌ ఫిలింగా భావించాల్సి వుంటుంది. నిజానికి, ఈ రిస్క్‌ తీసుకోవడానికి టాలీవుడ్‌ నుంచి ఏ హీరో ఇప్పటిదాకా ముందుకు రాలేదు. ఏ నిర్మాత కూడా రిస్క్‌ చేయడానికి ఇష్టపడటంలేదు. ఇటు మేకర్స్‌, అటు హీరో.. ఇంత పెద్ద రిస్క్‌ చేస్తున్న దరిమిలా, ఈ రిస్క్‌కి కరోనా సమస్యగా మారకూడదనే ఆశిద్దాం. తెలుగు సినిమా స్టామినాకే ఇది అసలు సిసలు పరీక్ష. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ రిజల్ట్‌తోనే సంక్రాంతి సినిమాల జాతకం కూడా ఆధారపడి వుంటుంది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS