సందీప్ ఉదారత... ఫ్రీ ఫుడ్ సర్వీస్

మరిన్ని వార్తలు

ప్రస్తుతం హీరోలు సంపాదించటానికి ఎంత శ్రద్ద పెడుతున్నారో సాయం చేసేందుకు కూడా అంతలా ముందు ఉంటున్నారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు. విజయవాడ వరద బాధితులకోసం టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. సందీప్ కిషన్ విజయవాడ వరద బాధితుల కోసం ఫుడ్, వాటర్ సప్లై చేసారు. సందీప్ కిషన్ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకో వైపు ఫుడ్ బిజినెస్ రంగంలో కూడా సత్తాచాటుతున్నారు. హైద్రాబాద్ లో సందీప్ కి వివాహ భోజనంబు అనే రెస్టారెంట్, పలు బ్రాంచ్ లు ఉన్నాయి.  ఆ రెస్టారెంట్స్ నుంచి తన  టీమ్ ద్వారా ఫుడ్ సప్లై చేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. 


ఇదొక్కటే కాదు గత కొన్నాళ్లుగా సందీప్ తన రెస్టారెంట్స్ ద్వారా ఒక బ్రాంచ్ నుంచి డైలీ ఫ్రీగా 50 మందికి ఫుడ్ ఇస్తున్నారు. సందీప్ కి హైద్రాబాద్ లో వివాహాభోజనంబు అనే పేరుతొ ఏడు రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆ ఎడిటి ద్వారా రోజూ 350 మందికి ఫ్రీగా  ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి రోజు గడవని పరిస్థితిలో ఉన్నవారిని, ఒక్క పూట కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్నవారిని తన రెస్టారెంట్ కి వచ్చి కడుపునిండా తిని వెళ్ళమని, లేదా పార్శిల్  తీసుకు వెళ్ళమని ఆఫర్ ఇచ్చాడు.  ఎవరైనా పర్లేదని భరోసా ఇచ్చాడు.    

అన్నిటికన్నా అన్నదానం గొప్పదని అంటుంటారు మన పెద్దలు. ఏది దానం చేసినా పొందేవారిలో ఇంకా అసంతృప్తి ఉండిపోతుంది. కానీ అన్నం పెడితే కడుపునిండాక సంతృప్తిగా దీవించి వెళ్ళిపోతారు. అలాంటి అద్భుత దానాన్ని చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు సందీప్. ఎంత సంపాదించా మన్నది ముఖ్యం కాదు, ఎంత సాయం చేశామన్నది, కష్టంలో ఉన్నవారికి ఏవిధంగా సాయ పడ్డామన్నది ముఖ్యం అని సందీప్ తెలియజేస్తున్నాడు. తాజాగా తన కోరికను మన్నించి తన టీమ్ పేదలకు భోజనం పంచుతున్న ఫొటోలు సందీప్ షేర్ చేసి, వారిని అప్రిసియేట్ చేసాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS