వెంకీతో తేజ కాంబో షూరూ అయ్యింది

మరిన్ని వార్తలు

'చిత్రం' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన తేజ, వరుసగా 'నువ్వు నేను', 'జయం' తదితర చిత్రాలతో విజయం అందుకున్నాడు. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ డైరెక్టర్‌ అనిపించుకున్నాడు. అయితే ఈ మధ్య తేజకి చెప్పుకోదగ్గ విజయాలు లేవు. కొత్త వాళ్లతో సినిమాలు తెరకెక్కించడం తేజ ప్రత్యేకత. అయితే ఆ ఫార్ములా ఈ మధ్య తేజకి వర్క్‌ అవుట్‌ కావడం లేదు. దాంతో ట్రాక్‌ మార్చేశాడు. సీనియర్స్‌తోనే సినిమాలకు సై అంటున్నాడు. 

ఇటీవలే రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాని తెరకెక్కించాడు తేజ. ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత బిగ్‌ ప్రాజెక్ట్‌ అయిన 'ఎన్టీఆర్‌' చిత్రం ఆయన చేతికి వచ్చింది. ఎన్టీఆర్‌ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బాలయ్య నటిస్తూ నిర్మించనున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా తేజ విక్టరీ వెంకటేష్‌తో ఓ సినిమాని ప్రారంభించేశాడు. ఈ రోజే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.  

తేజ సీనియర్స్‌తోనే ఇకపై సినిమాలు తెరకెక్కించాలనుకుంటున్నాడనడానికి ఇదో నిదర్శనం. వెంకటేష్‌ ఈ మధ్య మారుతి డైరెక్షన్‌లో వచ్చిన 'బాబు బంగారం' సినిమాతో నిరాశ పరిచినా, 'గురు' చిత్రంతో సక్సెస్‌ అందుకున్నాడు. తేజ డైరెక్షన్‌లో వచ్చే సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మొత్తానికి తేజ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అబ్బాయితో ఓ హిట్‌ అందుకుని, ఆ వెంటనే బాబాయ్‌ సినిమాని టేకప్‌ చేశాడు. బాబాయ్‌తో కూడా హిట్‌ కొడతాడేమో చూడాలి మరి. వెంకీతో సినిమా పూర్తి కాగానే బాలయ్యతో 'ఎన్టీఆర్‌' చిత్రం సెట్స్‌ మీదికి వెళ్లనుందట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS