పుష్ప రాజ్ కి ఐటెం గర్ల్ దొరికేసిందహో!

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ ప్రభంజనం సృష్టించింది. బాక్సాఫిస్ లెక్కల్ని తారు మారు చేసింది. ఒక స్థానికి సినిమా పాన్ ఇండియా సినిమాగా మారి అన్ని భాషల  ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీనితో పుష్ప 2 పై అంచనాలు పెరిగాయి. ఈ మూవీ కోసం  పాన్ ఇండియానే కాకుండా పాన్ వరల్డ్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం డిసెంబర్ కి వాయిదా పడింది. కారణం పుష్ప 2 లో కొంత షూటింగ్ పెండింగ్ ఉండటం, ఒక ఐటెం సాంగ్ కూడా పూర్తి కాకపోవటమే. 


మొదటి పార్ట్ లో సమంత చేసిన 'ఊ అంటావా మావా' ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. హీరోయిన్ రష్మికతో సమానంగా సామ్ కి కూడా క్రేజ్ తెచ్చింది ఈ సాంగ్. ఇప్పడు కూడా అదే తరహాలో ఒక ఐటెం సాంగ్ ఉందని టాక్. ఇందుకోసం సామ్ ని సంప్రదించగా ఆమె నిరాకరించింది. దీనితో ఇప్పటివరకు ఐటెం గర్ల్ కోసం వెతుకుతూనే ఉన్నారు మేకర్స్. కానీ ఎవరూ ఫైనల్ అవలేదు. జాన్వీ కపూర్ ఐటెం సాంగ్ లో నర్తిస్తుందని , ఇందుకు భారీ మొత్తం డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరకి ఇప్పుడు యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ఫిక్స్ అయినట్టు సమాచారం. 


యానిమల్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఫాలోవర్స్ ని పెంచుకున్న ఈ బ్యూటీ ఇపుడు వరుస అవకాశాలు అందుకుంటోంది. పుష్ప2 లో బన్నితో కలిసి చిందేస్తే అమ్మడి క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ మూవీ తరవాత సౌత్ లో హీరోయిన్ గా కూడా బిజీగా మారుతుందేమో చూడాలి. త్రిప్తి లాంటి శృంగార దేవతకి సౌత్ లో ఛాన్స్ లు రావటం కష్టమేమీకాదు. ఇప్పటికే ఈ మూవీలో నేషనల్ క్రష్ నటిస్తోంది. ఇంకోవైపు త్రిప్తి లాంటి అందం కూడా యాడ్ అయ్యి మూవీ హైపు పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మొత్తానికి యానిమల్ భామలు మరొకసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS