ప‌వ‌న్‌ని త్రివిక్ర‌మ్ ఒప్పిస్తాడా?

మరిన్ని వార్తలు

మ‌ల‌యాళ చిత్రం `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` సినిమా రీమేక్ పై గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ లో విప‌రీత‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. బాల‌కృష్ణ‌, రానా, ర‌వితేజ‌.. ఇలా చాలామంది హీరోల పేర్లు ఈ రీమేక్ కోసం వినిపించాయి. ఈ సినిమా సెట్స్‌పై వెళ్ల‌డం దాదాపుగా ఖాయ‌మైపోయిందన్నారు కూడా. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు. ఇప్పుడు ఈ రీమేక్‌లో కొత్త ట్విస్ట్ వ‌చ్చింది. ఈ సినిమాని ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ చూశాడ‌ని, ఈ సినిమాలో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడ‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఒక‌వేళ ప‌వ‌న్ గ‌నుక ఒప్పుకుంటే.. ఈ సినిమా రేంజ్ మ‌రో స్థాయిలో ఉంటుంది.

ఈ సినిమా హ‌క్కుల్ని హారిక హాసిని సంస్థ చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అటు హారిక‌కీ, ఇటు ప‌వ‌న్‌కీ త్రివిక్ర‌మ్ అత్యంత స‌న్నిహితుడు. అందుకే.. ఈ సినిమా రీమేక్ విష‌యంలో త్రివిక్ర‌మ్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్నాడ‌ని, త్రివిక్ర‌మ్ ప‌వ‌న్‌ని ఒప్పించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. అయితే ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌ట‌. ఆ బాధ్య‌త మ‌రొక‌రికి అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. మ‌రి... వేరెవ‌రో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తే.. ప‌వ‌న్ న‌టించ‌డానికి అంగీక‌రిస్తాడా?  చేతిలో ఇన్ని సినిమాలు ఉండ‌గా, మ‌రో రీమేక్‌కి ముందుకొస్తాడా అన్న‌ది తేలాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS