బాలీవుడ్‌పై కన్నేసిన టాలీవుడ్‌ రౌడీ.!

మరిన్ని వార్తలు

'అర్జున్‌రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో విజయ్‌ దేవరకొండ రేంజ్‌ బాగా పెరిగిపోయింది. అలా పెరిగిన రేంజ్‌ అతన్ని తమిళ సినిమా వైపుకు నడిపించింది. అయితే 'నోటా' ఫెయిల్యూర్‌తో పునరాలోచనలో పడ్డాడీ సెన్సేషనల్‌ యంగ్‌ హీరో. కానీ ఇప్పుడు 'టాక్సీవాలా' సక్సెస్‌తో మనోడి కాన్ఫిడెన్స్‌ మళ్లీ పుంజుకుంది. ఇదే ఊపులో బాలీవుడ్‌ ఛాన్స్‌లు దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఇటీవల ముంబై వెళ్లి ప్రముఖ నిర్మాత కమ్‌ డైరెక్టర్‌ అయిన కరణ్‌జోహార్‌ని కలిశాడట.

ఆ సందర్భంగా విజయ్‌దేవరకొండతో ఓ సినిమా గురించి కరణ్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే అతి త్వరలో విజయ్‌ దేవరకొండ నుండి బాలీవుడ్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ మనం వినే అవకాశం ఉంది. ఆ సినిమాలో విజయ్‌ సరసన అతిలోక సుందరి కూతురు జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయట. జాన్వీకపూర్‌ డేట్స్‌ కరణ్‌ జోహార్‌ దగ్గర ఉన్నాయి. జాన్వీ తొలి సినిమా అయిన 'ధడక్‌'కి సంబంధించి కరణ్‌జోహార్‌ అన్నీ తానే అయ్యి చూసుకున్నాడు.

ఇదిలా ఉంటే, ఆల్రెడీ విజయ్‌దేవరకొండ నటించిన 'అర్జున్‌రెడ్డి' సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. 'కబీర్‌సింగ్‌' టైటిల్‌తో షాహిద్‌కపూర్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఒరిజినల్‌ తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS