నా బర్తడే అంటేనే అసహ్యం వేస్తోంది అంటున్న యశ్

మరిన్ని వార్తలు

KGF తో పాన్ ఇండియా స్టార్ గా  గుర్తింపు తెచ్చుకున్న యశ్ పుట్టినరోజు ఒక విషాదాన్ని నింపింది. తన బర్త్ డే అంటేనే అసహ్యం వేస్తోందని యశ్ ఎమోషనల్ అయ్యారు. జనవరి 8 న యశ్ బర్తడే, ఈ సందర్భంగా తమ అభిమాన స్టార్ జన్మదినాన్ని జరుపుకోవటానికి ఫాన్స్ బ్యానర్  కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు యువకులు మరణించారు. బ్యానర్స్ కడుతుండగా పక్కనే ఉన్న పవర్ లైన్ నుంచి హై వోల్టేజ్ షాక్ కొట్టడంతో ఆ యువకులు అక్కడికక్కడే పడి మరణించారు.


ఈ ఘటన జనవరి 8 ఉదయం జరిగింది. ఈ విషయం తెలిసిన యశ్ సాయంత్రం ఆ మరణించిన ముగ్గురి అభిమానుల కుటుంబాలని పరామర్శించి ఓదార్చాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. "నాకు ఇంతమంది ఫ్యాన్స్ రావడం నా అదృష్టం. నేనెప్పుడూ నా కోసం బ్యానర్లు కట్టి హంగామా చేయమని అడగను. ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజుకి మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు ఏమైనా అవుతుందేమో అని నేను భయపడుతున్నాను.


అందరికి ఫ్యామిలీ ఫస్ట్. మీకు కూడా మీ కుటుంబమే ఫస్ట్ ఉండాలి. కుటుంబం తర్వాతే ఎవరైనా. నేను పుట్టిన రోజు జరుపుకోను అంటే అభిమానులు బాధపడతారని నేను డైరెక్ట్ గా చెప్పట్లేదు. కరోనా నుంచే నేను పుట్టిన రోజు జరుపుకోవట్లేదు. ఇలాంటి బర్త్ డేలు ఎవరూ కోరుకోరు. డబ్బులు సాయం ఎవరైనా చేస్తారు. కానీ పోయిన కొడుకు తిరిగి రాడు. మీరు ఇలా చేయడం వల్ల నా పుట్టిన రోజంటేనే అసహ్యం వేస్తుంది. దయచేసి ఇలాంటివి చేయకండి. కొంతమంది ఫాన్స్  నా కార్ వెనక బైక్ మీద ఫాలో అవుతూ, స్పీడ్ గా వస్తున్నారు, దయచేసి అలా చేయకండి" అని విన్నవించుకున్నాడు యశ్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS