వర్మను సపోర్ట్‌ చేసిన వైఎస్‌ జగన్‌.!

మరిన్ని వార్తలు

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాకి సంబంధించిన రగడ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ సినిమాని తెలంగాణాలో విడుదల చేశారు. కానీ ఆంధ్రాలో విడుదల కానివ్వలేదు. ఎలక్షన్స్‌ ముగిశాయి కాబట్టి మే 1న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ఆంధ్రాలో విడుదల చేస్తానని వర్మ సోషల్‌ మీడియా ద్వారా అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

 

ఈ క్రమంలో సినిమా విడుదలకు సంబంధించి విజయవాడలో ప్రెస్‌ మీట్‌ ప్లాన్‌ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. ఓ హోటల్‌లో ఈ ప్రెస్‌ మీట్‌కి ఏర్పాట్లు చేశారు. కానీ ఆ హోటల్‌ యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో రోడ్డుపై ప్రెస్‌ మీట్‌కి ప్లాన్‌ చేశారు. అయితే ఈ ప్రెస్‌ మీట్‌ని ఆంధ్ర పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యను అందరూ ఖండిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వర్మ చేసిన తప్పేంటి.? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సినీ భావ ప్రకటనా స్వేఛ్చపై ఉక్కు పాదం మోపినట్లే అని ఈ చర్యను పలువురు ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే, వైఎస్సార్‌ సీపీ నేతలే ఈ సినిమాకి నిర్మాతలు అన్న సంగతి తెలిసిందే.

 

నిజానికి ఈ సినిమా తెలంగాణాలో విడుదలైంది. ఆంధ్ర నుండి చాలా మంది అభిమానులు తెలంగాణాకొచ్చి మరీ ఈ సినిమాని చూశారు. ఇంత జరిగినాక ఇక ఇప్పుడు సినిమా విడుదలపై అసలింతగా అభ్యంతరాలెందుకు వ్యక్తమవుతున్నాయో అర్ధం కావడం లేదు.   


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS