రాజశేఖర్ కూతురు పై కేసు నమోదు

మరిన్ని వార్తలు

హీరో రాజశేఖర్ కుమార్తె శివాని పైన జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

శనివారం రాత్రి శివాని తను కారులో నడుపుకుంటూ ప్రమాదవశాత్తు వేరే వాహనాన్ని ఢీకొట్టిన సంగతి విదితమే. ఆ సంఘటనకి సంబంధించి అశోక్ కుమార్ అనే వ్యక్తి రాజశేఖర్ కుమార్తె శివాని పైన ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ మధ్యనే రాజశేఖర్ కూడా ప్రమాదవశాత్తు ఒక కారుని ఢీకొట్టడం అది మరువక ముందే మళ్ళీ ఈ సంఘటన జరగడం దురదృష్టకరం.

ఇక ఈ కేసుకి సంబంధించి రాజశేఖర్ కుటుంబం స్పందించాల్సి ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS