ఐదు పదుల వయసులోనూ వన్నె తరగని అందంతో మెరిసిపోతన్న బ్యూటీ శ్రీదేవి. అందుకే ఆమె ఆ తరం ఈ తరం అనే తేడా లేకుండా అందరికీ అతిలోక సుందరి అయ్యింది. హీరోయిన్గా తన నటనతోనూ, గ్లామర్తోనూ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లోనూ జోరుగా సాగిపోతోంది. 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమాతో తల్లిగా రీ ఎంట్రీ ఇచ్చన శ్రీదేవి, రీ ఎంట్రీలో తొలి సినిమాతోనే విజయం అందుకుంది. తాజాగా 'మామ్' సినిమాతో మరోసారి తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా శ్రీదేవికి 300వ సినిమా కావటం విశేషం. అంతేకాదు ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలున్నాయి. తల్లి పాత్రలో శ్రీదేవి పలికించిన హావ భావాలు అందర్నీ కట్టిపారేస్తాయంటోంది చిత్ర యూనిట్. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో శ్రీదేవి యాక్టివ్గా పాల్గొంటోంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి, శ్రీదేవి ఫోటోలు చూస్తుంటే అందంలో ఆమెకి సాటి ఇంకెవ్వరూ లేరనే అనిపిస్తోంది. ప్రతీ తల్లి ఈ సినిమాని చూసి తల్లిగా ఓ కొత్త అనుభూతిని పొందుతారనీ, ప్రతీ తల్లి తప్పకుండా చూడదగ్గ సినిమా అవుతుందనీ 'మామ్' సినిమా గురించి శ్రీదేవి అంటున్నారు. జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.