మరో మెగా హీరోతో వినాయక్‌

మరిన్ని వార్తలు

సాయిధరమ్‌తేజ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో 'విన్నర్‌' సినిమా చేస్తున్నాడు సాయి ధరమ్‌. ఈ సినిమాలో తేజుకి జోడీగా ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న ప్రేక్షకుల మందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. మరో పక్క సాయి ధరమ్‌ తేజ్‌ ఇటీవలే 'జవాన్‌' అనే మరో సినిమాకి కూడా కమిట్‌ అయ్యాడు. బివిఎస్‌ రవి ఈ చిత్రానికి దర్శకుడు. నాని హీరోయిన్‌ మెహరీన్‌ కౌర్‌ ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌తో జత కడుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది. కాగా ఈ రెండు చిత్రాల తర్వాత మెగా డైరెక్టర్‌ వినాయక్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా ఉంటుందట. అది వచ్చే సంక్రాంతికి విడుదలవుతుందని సమాచారమ్‌. ఈ 'విన్నర్‌' విడుదలకు సిద్ధమవుతుండగా, 'జవాన్‌' ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుందని సమాచారమ్‌. అలాగే ముచ్చటగా మూడో సినిమా అయిన వినాయక్‌ సినిమానీ డిశంబరులోనే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేయవచ్చునట. మొత్తానికి ఈ ఏడాది సాయి ధరమ్‌ తేజ్‌ మాంచి జోరు మీదున్నాడనీ తెలుస్తోంది. గతేడాది కూడా రెండు సినిమాలతో తేజు మన ముందుకు వచ్చాడు. వాటిలో 'సుప్రీమ్‌' సూపర్‌ హిట్‌ సొంతం చేసుకోగా, 'తిక్క' నిరాశ పరిచింది. కానీ ఈ సారి అలా కాదట. పక్కా లెక్కలతో వస్తున్నాడట తేజు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS