మహేష్- రాజమౌళి మూవీ: 2 భాగాలు.. రూ.1000 కోట్లు

మరిన్ని వార్తలు

బాహు బలి, RRR లాంటి సినిమాలతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి  తీసుకెళ్లిన రాజమౌళి నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తారా అని వరల్డ్ వైడ్ గా ఎదురుచూస్తున్నారు. అలాంటి టైంలో మహేశ్ బాబుతో మూవీ అనౌన్స్ చేయటంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. మహేశ్ ‘గుంటూరు కారం’ షూటింగ్‌, ప్రమోషన్స్ లో బిజీగా ఉండడంతో రాజమౌళి కూడా కథను పూర్తిస్థాయిలో సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కకముందే రక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఒక అప్డేట్ ఫ్యాన్స్‌ ని సంబరాల్లో ముంచింది.


ఈ మూవీ ప్రకటించిన దగ్గర నుంచి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీకి 1000 కోట్ల బడ్జెట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రేంజ్ బడ్జెట్ తో వస్తున్న తెలుగు మూవీ ఇదే కావటం గమనార్హం. ఎప్పటిలానే షూటింగ్ ప్రారంభించే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మూవీకి సంబంధించిన విశేషాలను అందరితో పంచుకోనున్నాడట రాజమౌళి.


ఈ మూవీ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్ కూడా ఓ సందర్భం లో మాటాడుతూ మహేశ్‌తో తెరకెక్కించనున్న సినిమాతో ఇప్పటివరకు ఇండియన్ సినిమా ప్రేక్షకులు చూడని ఒక కొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరిస్తాడని, ఈ కథ అమెజాన్ అడవుల బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలిపారు. అన్నిటికంటే ఇంట్రస్టింగ్ విషయం ఈ మూవీ కూడా రెండు భాగాలుగా రానుందని , సీక్వెల్‌కు అవకాశం ఉండేలా సినిమా ముగుస్తుందని రివీల్ చేశారు విజయేంద్ర ప్రసాద్. ఈ న్యూస్ విన్న సినీ ప్రియులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS