అన్నీ అనుకున్నట్టు జరిగితే - ఈ పాటికి ఆచార్య థియేటర్లలో ఉండేది. ఆ సినిమా రికార్డుల గురించి అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకునేవాళ్లు. కరోనా సెకండ్ వేవ్... ఆ ఆశలపై నీళ్లు చల్లేసింది. ఆచార్యనే కాదు.. ఏ సినిమానీ విడుదల చేయకుండా... అడ్డుకట్ట వేసింది కరోనా. థియేటర్ల దగ్గర మళ్లీ సందడి చూడ్డానికి కనీసం మూడు, నాలుగు నెలలైనా పడుతుంది.
ఆచార్య విషయానికే వస్తే.. ఈ సినిమా ఈ యేడాది రావడం అసాధ్యమని ట్రేడ్ వర్గాలు తేల్చేస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా కోసం ఇంకా రెండు నెలల షూటింగ్ బాకీ ఉందట. అంటే.. ఆగస్టు, సెప్టెంబరుల్లో షూటింగ్ మొదలైనా... షూటింగ్ ముగిసేసరికి నవంబరు అవుతుంది. నవంబరు - డిసెంబరు... బ్యాడ్ సీజన్. ఆ సీజన్లో సినిమాని విడుదల చేయాలని ఎవరూ అనుకోరు. కాబట్టి... సంక్రాంతికి షిఫ్ట్ అవుతుంది. అలా జరగాలన్నా.. సెకండ్ వేవ్ ఉధృతి బాగా తగ్గి, షూటింగులకు అనువైన వాతావరణం ఏర్పడాలి. ఇవన్నీ జరిగే పనులేనా? అన్నది పెద్ద ప్రశ్న.