కమెడియన్ కృష్ణుడు ఇంట విషాదం.

మరిన్ని వార్తలు

విలేజ్ లో వినాయకుడు, పప్పు చిత్ర నటుడు కృష్ణుడు ఇంట విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి 'సీతారామరాజు' సోమవారం అనారోగ్య కారణాల వల్ల భీమవరంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీతారామరాజు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ కి సన్నిహితులు.

 

సీతారామరాజు రాజోలు నివాసితులు. వీరిధీ ఒకప్పుడు జమిందారీ కుటుంబం..ఇందిరా గాంధీ భూసేకరణ చట్టం లో అత్యధికంగా భూములు కోల్పోయిన వారి లో వీరు ఒకరు. సీతారామరాజు అన్న సూర్య నారాయణ రాజు 25 ఏళ్ళు రాజోలు ఎమ్మెల్యే గా మరియు ఎన్టీఆర్ ప్రభుత్వం లో డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు.

 

కొంత కాలంగా కృష్ణుడు కూడా సినిమాలను వదిలి ఆంధ్ర ప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మరియు జగన్మోహన్ రెడ్డి పాద యాత్రలో పాల్గొని రాజకీయాల్లో యాక్టీవ్ గా కనిపించారు. తన తండ్రి మరణాంతరం పలువురు సినీ ప్రముఖులు మరియు వైసీపీ నేతలు కృష్ణుడు మరియు తన కుటుంబ సబ్యులకు సానుభూతి తెలియపరిచారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS