‘షీ సేఫ్‌’ యాప్‌ని ప్రారంభించిన సాయి పల్లవి!

మరిన్ని వార్తలు

‘భానుమతి.. ఒక్కటే పీస్‌.. హైబ్రీడ్‌ పిల్ల..’ అంటూ ‘ఫిదా’ సినిమాతో అందర్నీ ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. తాజాగా హైద్రాబాద్‌లో జరిగిన మహిళా సాధికారత సదస్సుకు చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యింది. సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌ పరిధిలోని మహిళా ఉద్యోగుల భద్రత కోసం ‘షీ సేఫ్‌’ యాప్‌ని ప్రారంభించింది. ఈ క్రమంలో మహిళలకు హైద్రాబాద్‌ సేఫెస్ట్‌ సిటీ అని సాయి పల్లవి అభిప్రాయపడిరది. గతంలో చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఆడపిల్లలని సిటీకి పంపించాలంటే తల్లితండ్రులు భయపడేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకు కారణం మన హైద్రాబాద్‌ పోలీసులు.

 

మహిళల భద్రత కోసం వారు ఎంతగానో కృషి చేస్తున్నారు. వారి కృషికి మెచ్చుకుని, వారికి మన వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా సాయి పల్లవి కోరారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతి లక్రా తదితర ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇంతటి గొప్ప ప్రముఖుల మధ్య మాట్లాడే అవకాశం తనకి దక్కినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలిపింది. ఇకపోతే, ప్రస్తుతం సాయి పల్లవి ‘లవ్‌స్టోరీ’ సినిమాలో నటిస్తోంది.

 

నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా సమ్మర్‌కి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రానాతో సాయి పల్లవి నటిస్తున్న ‘విరాట పర్వం’ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. మరోవైపు తమిళంలో ధనుష్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మారి 2’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS