‘ఇండియన్‌ 2’ యాక్సిడెంట్‌పై రెస్పాండ్‌ అయిన బన్నీ.!

మరిన్ని వార్తలు

ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్‌ 2’ సెట్స్‌లో జరిగిన క్రేన్‌ ప్రమాదం అందర్నీ కలిచి వేసింది. పలువురు సెబ్రిటీలు ఈ యాక్సిడెంట్‌ పట్ల ట్విట్టర్‌లో స్పందించారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఈ యాక్సిడెంట్‌ పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘ ఇది చాలా భయంకరమైన సంఘటన.. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను..’ అంటూ ట్విట్టర్‌లో తెలిపారు.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ‘నేను సజీవంగానే ఉన్నాను.. అన్నందుకు సాక్ష్యంగా ఈ పోస్ట్‌ టైప్‌ చేస్తున్నాను. కొన్ని సెకన్లు తేడాలో ఈ భయంకరమైన ప్రమాదం నుండి నేను తప్పించుకోగలిగాను..’ అంటూ, కాజల్‌ ఆవేదన వ్యక్తం చేసింది. మానిటర్‌లో సీన్‌ చెక్‌ చేసుకుని అప్పుడే అక్కడి నుండి పక్కకి వెళ్లిన కాజల్‌, తృటిలో ఈ ప్రమాదం నుండి భయపడిందట. కళ్ల ముందరే రెప్ప పాటులో తన సహచరుల్ని కోల్పోయిన కాజల్‌ తీవ్రమైన షాక్‌కి గురయ్యిందట. నిజంగానే చాలా భయంకరమైన ఘటన ఇది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్‌పైకి వెళ్లింది. ఇంతలోనే ఇలా జరగడం విషాదకరం. ఈ ఘటన పట్ల ఆరా తీసిన పోలీసులు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై కేసు నమోదు చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS