‘మొదటి మహిళ‘గా ఐశ్వర్య రాయి

మరిన్ని వార్తలు

తన అందంతో, అభినయంతో ఎన్నో కోట్లమందిని అలరించిన నటి ఐశ్వర్య రాయికి ‘ఫస్ట్ లేడీ’ పురస్కారం లభించింది. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలని గుర్తించి సత్కరించే కార్యక్రమమే ‘ఫస్ట్ లేడీస్’.

శనివారం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఐశ్వర్య రాయికి ఈ పురస్కారం అందచేయడం జరిగింది. ఈ పురస్కారానికి రావడం వెనుక భారతదేశం నుండి కేన్స్ చలనచిత్రోత్సవాలలో జ్యూరీ సభ్యులలో ఒకరిగా ఎంపిక అయిన ఏకైక నటి కావడంతో ఈ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది.

ఇక ఇదే కార్యక్రమంలో ఐశ్వర్య రాయితో పాటుగా 112 మంది మహిళలకి ఈ పురస్కారం అందచేశారు. ఇదిలావుండగా తల్లిగా ఒక బిడ్డని జన్మనించిన తరువాత సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న ఐశ్వర్య రాయి ఇప్పుడు మళ్ళీ సినిమాలలో బిజీగా మారింది. త్వరలోనే ఆమె నుండి కొత్త సినిమా రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS