సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్కి కరోనా సోకిందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది . కాజోల్తో పాటు, ఆమె కూతురికి కూడా కరోనా ఉందంటూ, వార్తల్లో తేలిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్తపై ఆందోళన చెందిన ఆమె భర్త అజయ్ దేవగణ్ రీసెంట్గా స్పందించారు. తన భార్య కాజోల్, ఇంకా కూతురికి కరోనా లేదని, ప్రస్తుతం వారు పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారనీ అజయ్ దేవగణ్ స్పష్టం చేశారు.
కరోనా సోకిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. కాజోల్కి కరోనా.. అనే ప్రచారంతో ఆమె అభిమానులు కూడా ఆందోళన చెందుతూ, సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారట. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదలా ఉంటే, ఇవే కాదు, కరోనాపై ఫేక్ పోస్ట్లు పెట్టొద్దని ఇప్పటికే ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అలా ఫేక్ వార్తలు వైరల్ చేసేవారికి కఠిన శిక్షలు కూడా ఉంటాయని గవర్నమెంట్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
Thank you for asking. Kajol & Nysa are absolutely fine. The rumour around their health is unfounded, untrue & baseless🙏
— Ajay Devgn (@ajaydevgn) March 30, 2020