పొలిటికల్‌ థ్రిల్లర్‌లో అజిత్‌?

మరిన్ని వార్తలు

ఈ మధ్య యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న తమిళ హీరో అజిత్‌, త్వరలో పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీలో నటించబోతున్నారా.? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ప్రస్తుతం బాలీవుడ్‌ 'పింక్‌' మూవీ రీమేక్‌లో నటిస్తున్నారు అజిత్‌. దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకి హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.

 

ఇదిలా ఉంటే, అజిత్‌ తదుపరి చిత్రంపై ఓ వార్త హాట్‌ హాట్‌గా కోలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బ్యాక్‌ టు బ్యాక్‌ అదే డైరెక్టర్‌ అంటే హెచ్‌ వినోద్‌తోనే అజిత్‌ ఇంకో సినిమా ఓకే చేశారనీ తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా బోనీ కపూరే నిర్మాతగా వ్యవహరించే అవకాశాలున్నాయట. ఇక కథ విషయానికి వచ్చేసరికి ఈ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందనుందనీ తెలుస్తోంది. అయితే రియల్‌ రాజకీయాలే కాదు, రీల్‌ రాజకీయాల పైనా పెద్దగా అజిత్‌ ఆశక్తి చూపించరనే టాక్‌ ఉంది. మరి, పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో స్టోరీ అంటే అజిత్‌ ఒప్పుకుంటారా.? ఏమో తెలీదు, కానీ, ఇదే డైరెక్టర్‌ దగ్గర రెండు కథలున్నాయనీ, వాటిలో ఒకటి పొలిటికల్‌ థ్రిల్లర్‌ కాగా, ఇంకోటి సోషల్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ మూవీ అని తెలుస్తోంది.

 

ఈ రెండింట్లో దేన్ని ఎంచుకోవాలా.? అనే సందిగ్థంలో ఉన్నారట అజిత్‌. త్వరలోనే ఏదో ఒకటి ఫైనల్‌ చేస్తారనీ తెలుస్తోంది. అజిత్‌ ఏం చేసినా అది బంగారమే అవుతోందిప్పుడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్నారాయన. ప్రజెంట్‌ చర్చల్లో ఉన్న రెండు కాన్సెప్ట్స్‌లోనూ ఏది ఓకే చేసినా ఫ్యాన్స్‌కి ఓకే. ఫైనల్‌ డెసిషన్‌ అజిత్‌దే. ఏం చేస్తారో వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS