2 కోట్ల డీల్‌ని లైట్‌ తీసుకున్న సాయిపల్లవి

మరిన్ని వార్తలు

హీరోయిన్‌ సాయిపల్లవిని చూడగానే ముందుగా ఆమె మొహమ్మీద మచ్చలే గుర్తుకొస్తాయి కొందరికి. మేకప్‌తో సింపుల్‌గా వాటిని కవర్‌ చేసే అవకాశం వుంది. అయితే, సాయిపల్లవికి సహజంగా కన్పించడమే ఇష్టం. అందుకే, పెద్దగా మేకప్‌ జోలికి వెళ్ళదు. 'నేనింతే, నేనిలాగే వుంటా. అదే నాకిష్టం' అని పలు సందర్భాల్లో సాయిపల్లవి చెప్పింది. మలయాళ 'ప్రేమమ్‌'తో అందర్నీ తన నటన, అంద చందాలతో కట్టిపడేసిన ఈ మలర్‌ బ్యూటీకి ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ సంస్థ నుంచి తమ ఫేస్‌ క్రీమ్‌ ప్రమోషన్‌ కోసం బిగ్‌ డీల్‌ వచ్చిందట.

 

ఆ డీల్‌ విలువ అక్షరాలా 2 కోట్లు. కానీ, సింపుల్‌గా ఆ డీల్‌ని తిరస్కరించింది సాయిపల్లవి. ఇప్పటిదాకా ఈ విషయం అనధికారికం. తాజాగా సాయిపల్లవి ఈ విషయాన్ని వెల్లడించింది. 'నాకు మొటిమలు ఎక్కువ. నేను డాక్టర్‌ని కదా, అవెందుకు వస్తాయో నాకు తెలుసు. అవి ప్రమాదకరమైనవి కావు. క్రీమ్స్‌ వాడటం ద్వారా శరీరాన్ని మరింత పాడుచేసుకోవడం నాకిష్టం లేదు. పైగా, సహజసిద్ధమైన అందంతోనే ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడం నాకిష్టం' అని చెప్పింది సాయిపల్లవి.

 

'ఇది ఇండియన్‌ బ్యూటీ.. అయినా నా అందం కంటే, నా నటనని ప్రేక్షకులు ఇష్టపడాలి.. అదే నా తపన, లక్ష్యం' అని సాయిపల్లవి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. సాయిపల్లవి నటించిన తాజా చిత్రం 'ఎన్‌జికె' ప్రేక్షకుల ముందుకొస్తోంది మరికొద్ది గంటల్లోనే. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో మరో హీరోయిన్‌. తమిళ హీరో సూర్య నటించిన చిత్రమిది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS