అజిత్ తో 'పింక్‌' రీమేక్‌ నిజమేనట.!

మరిన్ని వార్తలు

తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్‌ మూవీ 'పింక్‌'ని తమిళంలో రీమేక్‌ చేస్తున్నారంటూ ఈ మధ్య వార్తలు వినిపించాయి. అయితే ఇంతవరకూ ఆ విషయంపై అపీషియల్‌ క్లారిటీ రాలేదు. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయనున్నారనీ, తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తాడనీ ప్రచారం జరిగింది.

బోనీకపూర్‌, అజిత్‌ల మధ్య ఈ రీమేక్‌ చర్చలు కాస్త జోరుగానే జరిగాయట కూడా. అయితే కోలీవుడ్‌ వర్గాలు తర్వాత కామ్‌గా ఉండడంతో ఈ ప్రాజెక్ట్‌పై వచ్చినవన్నీ గాసిప్సే అని కొట్టిపడేశారు. అయితే ఇదంతా నిజమే అన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా 'పింక్‌' రీమేక్‌కి సన్నాహాలు జరుగుతున్న మాట వాస్తవమేనట. అయితే తమిళ నేటివిటీకి తగ్గట్లుగా, తమిళంలో అజిత్‌కున్న స్టార్‌డమ్‌కి తగ్గట్లుగా ఈ సినిమా ఒరిజినల్‌ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారనీ తెలుస్తోంది.

త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది. ఇకపోతే ప్రస్తుతం అజిత్‌ 'విశ్వాసం' సినిమా విడుదలకు సిద్ధమైంది. 'వీరమ్‌', వివేగమ్‌' తదితర చిత్రాలతో వరుస విజయాలందుకుంటున్నాడు అజిత్‌. తమిళంతో పాటు, తెలుగులోనూ అజిత్‌ సినిమాలకు మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో విజయవంతమైన 'పింక్‌' మూవీ రీమేక్‌తో ఎలాంటి సంచలనాలు అందుకుంటాడో అజిత్‌ చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS