అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ విడుదలకు ముహూర్తం ఖరారు..!

మరిన్ని వార్తలు

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఒక పాట మినహా టోటల్‌గా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు జనవరి 25న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.

అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS