ఖిలాడీని ఇంప్రెస్‌ చేసిన నిత్యామీనన్‌!

మరిన్ని వార్తలు

నిత్యామీనన్‌ మామూలు గడుసుపిల్ల కాదండోయ్‌. ఏకంగా ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ని కూడా ఇంప్రెస్‌ చేసేసింది. సౌత్‌లో నిత్యామీనన్‌ అంటే ఓ రేంజ్‌ గుర్తింపు ఉంది. ఓ తెగ స్టార్‌డమ్‌ అనలేం కానీ, నిత్యా అంటే ఎలాంటి పాత్రనైనా టేకప్‌ చేయగలదు. టేకప్‌ చేసినాక, ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేయగలదు.. సూపర్‌ స్టార్‌నే కాదు, ఇంకే స్టార్‌నైనా డామినేట్‌ చేసేయగల యాక్టింగ్‌ టాలెంట్‌ ఆమెది.. అన్న విషయాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు నటిగా సౌత్‌ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

 

బోలెడన్ని అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే ఇప్పుడీ బొద్దుభామ నార్త్‌లోనూ పాదం మోపింది. త్వరలో రానున్న 'మిషన్‌ మంగళ్‌' చిత్రంలో సైంటిస్ట్‌గా నటించింది నిత్యా మీనన్‌. ఈ సినిమా ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌తో పాటు, విద్యాబాలన్‌, సోనాక్షి సిన్హా, తాప్సీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్‌కుమార్‌తో తెగ పొగిడించేసుకుంటోంది నిత్యామీనన్‌.

 

నిత్యాకి బాలీవుడ్‌లో ఇది తొలి చిత్రం కావచ్చేమో కానీ, సౌత్‌లో పలు చిత్రాల్లో నటించేసింది, పలు అవార్డులు కూడా సొంతం చేసేసుకుంది.. అంటూ ఖిలాడీతో పొగిడించుకోవడమంటే మాటలు కాదు కదా.. అంటే అక్షయ్‌ కుమార్‌ని నిత్యా ప్రత్యేకంగా ఆకర్షించేసిందన్న మాట. అక్షయ్‌ దృష్టిలో పడిందంటే, ఏదో ఒక్క ఛాన్స్‌తో సరిపెట్టుకునేలా లేదు నిత్యా. బాలీవుడ్‌లోనూ దుమ్ము దులిపేసేలానే కనిపిస్తోంది. మరోవైపు తమిళంలో నిత్యా ప్రధాన పాత్రలో జయలలిత బయోపిక్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS