'అల వైకుంఠపురములో'.. ఇంట్రస్టింగ్ ప్లాష్ బ్యాక్ ?

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న 'అల వైకుంఠపురములో' సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో ఓ ఇంట్రస్టింగ్ ప్లాష్ బ్యాక్ ఉంటుందట. ఆ ప్లాష్ బ్యాక్ లో బన్నీ డబుల్ రోల్స్ లో కనిపిస్తాడని.. అయితే కేవలం ఐదు నిముషాల నిడివి మాత్రమే ఆ రోల్ కి ఉంటుందట. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా...శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 

 

ఇక ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఈ రెండు సంస్థలూ రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని టాక్. బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. అందుకే ఈ సినిమాకి ఓ రేంజ్ లో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని అమ్మారు.

 

ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ తో నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

 

ఈ సినిమాలో త్రివిక్రమ్ కామెడీ హైలెట్ అయ్యేలా ప్లాన్ చేశాడట. ముఖ్యంగా వెన్నల కిషోర్ కోసం అద్భుతమైన పాత్రను రాశాడట. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం బన్నీకి - కిషోర్ కి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా నవ్విస్తాయని.. అలాగే సెకెండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీక్వెన్స్ లో కూడా కిషోర్ పగలబడి నవ్వేలా కామెడీ చేస్తాడట. దీనికితోడు సినిమాలో అల్లు అర్జున్ ను త్రివిక్రమ్ కాస్త వైవిధ్యంగా చూపించబోతున్నాడట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS