పాపం ఈ హీరోహీరోయిన్ల ఇద్దరిదీ ఒకటే బాధ !

మరిన్ని వార్తలు

'అర్జున్ రెడ్డి'.. చిన్న చిత్రంగా రిలీజ్ అయి.. ఎవరూ ఊహించని విధంగా సంచలనాత్మక విజయాన్నే అందుకుంది. ఆ విజయానికి తగ్గట్లుగానే ఈ చిత్రంలో హీరోగా నటించిన 'విజయ్ దేవరకొండ' ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డికి హీరోయిన్ గా బోల్డ్ క్యారెక్టర్ తో రెచ్చిపోయిన 'షాలినీ పాండే'కు మాత్రం ఆ సినిమా తరువాత ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు. ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ '118'ను మినహాయిస్తే.. అర్జున్ రెడ్డి తరువాత ఆమెకు హీరోయిన్ గా సరైన సినిమానే లేదు.

 

ఇలాంటి పరిస్థితుల్లో ఈ బోల్డ్ హీరోయిన్ కు ఓ మంచి సినిమా వచ్చింది. అదే ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న 'ఇద్దరి లోకం ఒకటే'. ఈ సినిమాలో షాలినీ పాండేను మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఒక విధంగా ఇది షాలినీ పాండేకు బంఫర్ ఆఫరే. మరి ఈ చిత్రంతోనైనా షాలినీ పాండేకు కాలం కలిసి వస్తోందేమో చూడాలి. ఇక యంగ్ హీరో రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. కనీసం ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో.

 

మొత్తానికి పరాజయాల్లో మునిగి తేలుతున్న ఈ కుర్ర హీరో హీరోయిన్లు ఇద్దరిదీ ప్రస్తుతం ఒకటే బాధ అయిపొయింది. మరి 'ఇద్దరి లోకం ఒకటే'తోనైనా ఈ ఇద్దరి బాధ పోయి హిట్ రావాలని ఆశిద్దాం. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో జి.ఆర్ కృష్ణ తెలుగు తెరకు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS