దసరా బరిలో స్టైలిష్‌ స్టార్‌.!

మరిన్ని వార్తలు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నుండి సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా.? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ సినిమా లాంఛనంగా ఓపెన్‌ అయిన సంగతి తెలిసిందే. 24 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది ఈ సినిమా.

 

షూటింగ్‌ స్టార్టయ్యాక అస్సలు డిలే చేయకుండా, కంటిన్యూగా చిత్రీకరణ జరపాలని అల్లు అర్జున్‌ సూచిస్తున్నాడట. సెప్టెంబర్‌కల్లా సినిమాని పూర్తి చేసి, దసరాకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచన చేస్తున్నారట. ఇటు త్రివిక్రమ్‌ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. 'అజ్ఞాతవాసి', 'అరవింద సమేత..' చిత్రాలతో వరుసగా నిరాశ పరిచిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇప్పుడు బన్నీతో కలిసి పక్కా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు. అది వీలైనంత త్వరగా జరగాలనుకుంటున్నాడు. అందుకే లేట్‌ అయినా, లేటెస్ట్‌గా రావాలనుకుంటున్నాడు. గ్రౌండ్‌ వర్క్‌ అంతా పర్‌ఫెక్ట్‌గా రెడీ చేసి పెట్టాడు. తండ్రి సెంటిమెంట్‌తో ఈ సినిమా ఉండబోతోందనే ప్రచారం జరుగుతోంది. సెంటిమెంట్‌ దారి సెంటిమెంట్‌దే. అయితే త్రివిక్రమ్‌ స్టైల్‌ కామెడీ పంచ్‌లు బాగా పేల్చనున్నాడట. గత చిత్రాల మాదిరి ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నాడనీ సమాచారమ్‌.

 

ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్దే పేరు కన్‌ఫామ్‌ చేసిన సంగతి తెలిసిందే. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. హారికా హాసినీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS