స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రిలీజ్ కి దగ్గరలో ఉంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఒక ఆసక్తికర అంశం బయటికొచ్చింది.
ఆ వార్త ఏంటంటే- మిలిటరీ మాధవరం అనే ఊరిలో ఈ చిత్రానికి సంబందించిన ఒక కార్యక్రమం నిర్వహించాలని ఒక నిర్ణయం చిత్ర యూనిట్ తీసుకుందట. ఈ ఊరినే ఎంపిక చేసుకోవడానికి కారణం, ఈ ఊరి నుండి మొదటి, రెండు ప్రపంచయుద్ధాలలో సుమారు 1200 మంది పాల్గొన్నారు, అందులో 91 మంది వీర మరణం పొందారు.
ఇంతటి మిలిటరీ నేపధ్యం ఉన్న ఈ ఊరిలో అదే మిలిటరీ నేపధ్యంతో తీసిన ఈ చిత్రానికి సంబంధించిన ఒక కార్యక్రమం నిర్వహించడం సమంజసం అన్న అభిప్రాయం వెలువడుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది అలాగే ఈ నెల ఏప్రిల్15న ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందట.
మొత్తానికి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి సంబందించిన ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి.