మిలిటరీ మాధవరంలో అల్లు అర్జున్!

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రిలీజ్ కి దగ్గరలో ఉంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఒక ఆసక్తికర అంశం బయటికొచ్చింది.

ఆ వార్త ఏంటంటే- మిలిటరీ మాధవరం అనే ఊరిలో ఈ చిత్రానికి సంబందించిన ఒక కార్యక్రమం నిర్వహించాలని ఒక నిర్ణయం చిత్ర యూనిట్ తీసుకుందట. ఈ ఊరినే ఎంపిక చేసుకోవడానికి కారణం, ఈ ఊరి నుండి మొదటి, రెండు ప్రపంచయుద్ధాలలో సుమారు 1200 మంది పాల్గొన్నారు, అందులో 91 మంది వీర మరణం పొందారు.

ఇంతటి మిలిటరీ నేపధ్యం ఉన్న ఈ ఊరిలో అదే మిలిటరీ నేపధ్యంతో తీసిన ఈ చిత్రానికి సంబంధించిన ఒక కార్యక్రమం నిర్వహించడం సమంజసం అన్న అభిప్రాయం వెలువడుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది అలాగే ఈ నెల ఏప్రిల్15న ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందట.

మొత్తానికి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి సంబందించిన ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS