అల్లు అయాన్ ఎంట్రీ... ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన  ‘పుష్ప- ది రైజ్’ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.  ఈ మూవీతో ఐకాన్‌ స్టార్‌ నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.  ఈ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. పుష్ప మానియా ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ మూవీలో బన్నీ స్టైల్, మానరిజమ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. సెలబ్రిటీస్, క్రికెటర్స్ కూడా బన్నీని  అనుసరించి సోషల్ మీడియాలో వైరలయ్యారు. ఇప్పడు  'పుష్ప 2 ది రూల్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ సినిమాల్లో  మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఇది ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక రూమర్ మెగా ఫాన్స్ ని సంబరాల్లో ముంచింది.


పాన్ వరల్డ్ మూవీ ‘పుష్ప- ది రైజ్’  లో అల్లు అర్జున్ వారసుడు ‘అల్లు అయాన్’ కూడా నటించనున్నట్లు సమాచారం. సుకుమార్ అయాన్ కోసం ‘పుష్ప-2’లో ఓ కీలక పాత్రను ప్లాన్ చేస్తున్నారని టాక్. బన్నీ కి నేషనల్ అవార్డు తెచ్చి పెట్టిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అయాన్  కూడా కనిపిస్తే వేరే లెవెల్ లో ఉంటుందని ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పుడు టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ జోరుగా సాగుతోంది. ఈ మధ్యనే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'భక్త కన్నప్ప' లో తన కొడుకుని పరిచయం చేస్తున్నాడు. మహేష్ కూతురు సితార 'SSMB29 ' లో నటిస్తోందని ప్రచారం ఊపందుకుంది. అల్లు అర్హ ఇప్పటికే శాకుంతలం లో నటించింది. ఇప్పుడు అయాన్ ఎంట్రీ. అయితే  ఈ వార్త పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 

పుష్ప సీక్వెల్‌ లో కొన్ని పాత పాత్రలతో పాటు కొత్త పాత్రలు కూడా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 15న, వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. పుష్ప మూడో పార్ట్ కూడా ఉంటుందని ఈ మధ్య బన్నీ క్లారిటీ ఇచ్చాడు. సో ఈ సిరీస్ ఎన్ని ప్రభంజనాలు సృస్టించనుందో, చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS