కాన్ఫిడెంట్‌గా కొట్టేస్తానంటోన్న అల్లువారబ్బాయ్‌

మరిన్ని వార్తలు

తొలి సినిమా నుండీ విలక్షణంగా సినిమాలు ఎంచుకుంటూ వస్తున్నాడు అల్లు వారబ్బాయి అల్లు శిరీష్‌. అన్నయ్య అల్లు అర్జున్‌ మాస్‌ హీరో అనిపించుకుంటే, మనోడు మాత్రం విభిన్నంగా ఆలోచిస్తున్నాడు. సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. 'గౌరవం' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. తొలి సినిమానే బైలింగ్వల్‌ చేశాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందిందీ సినిమా. ఆ తర్వాత నుండీ తెలుగులో విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటున్నాడు. 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత కొంచెం గ్యాప్‌ తీసుకుని తాజాగా 'ఒక్క క్షణం' సినిమాతో వస్తున్నాడు. ఈ గ్యాప్‌లో మనోడు మలయాళంలో ఓ సినిమాలో నటించాడు. '1971 బియాండ్‌ బోర్డర్స్‌' అనే సినిమాలో శిరీష్‌ నటించాడు. 

తర్వాత 'ఒక్క క్షణం' కథ నచ్చి ఈ సినిమాకి ఓకే చెప్పాడు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. సురభి, సీరత్‌ కపూర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పేర్లల్‌ లైఫ్‌ అనే కొత్త కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. టీజర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. శిరీష్‌ కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ వి.ఐ.ఆనంద్‌ ఈ సినిమాతో మరో కొత్త కాన్సెప్ట్‌ని పరిచయం చేయబోతున్నాడు. 

ప్రచార చిత్రాలు చాలా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా శిరీష్‌కి మరో మంచి హిట్‌నిస్తుందని ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా, శిరీష్‌ తనలా మాస్‌ కాదనీ, సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ టాలెంట్‌ శిరీష్‌లో ఉందనీ, మాస్‌ కన్నా అదే గ్రేట్‌ అనీ తన తమ్ముడిని తెగ పొగిడేస్తున్నాడు అల్లు అర్జున్‌. అల్లు అర్జున్‌ నటిస్తున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS