బుల్లితెరపై యాంకర్గా సత్తా చాటుతూ, అవకాశం చిక్కినప్పుడల్లా వెండి తెరనూ దుమ్ము దులిపేస్తున్న ఆంటీ, సారీ.. సారీ.. ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. అనసూయలోని అసలు సిసలు నటిని కనిపెట్టి తీసిన క్రెడిట్ మాత్రం బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్కే దక్కిందనాలి. 'రంగస్థలం'కు ముందు, 'రంగస్థలం'కు తర్వాత అని అనసూయ సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలేమో.. అనేంతలా 'రంగమ్మత్త' క్యారెక్టర్ని డిజైన్ చేశాడు అనసూయ కోసం సుకుమార్. ఆ పాత్రకు అంతే ప్రాణం పోసింది అనసూయ కూడా.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ స్థాయిలో అనసూయకు పేరు దక్కింది లేదు కానీ, ఇప్పుడు మళ్లీ సుకుమార్తోనే ఆ ఘనత దక్కనుందని అల్లు అర్జున్ సినిమా ద్వారా అర్ధం చేసుకోవాలి. అదేనండీ, సుకుమార్ - బన్నీ కాంబినేషన్లో ఆల్రెడీ మన రంగమ్మత్త ఓ జబర్దస్త్ క్యారెక్టర్ కొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఇలా ఉండగా, మరో క్రియేటివ్ డైరెక్టర్ దృష్టినీ మన రంగమ్మత్త తీక్షణంగా తాకేసింది. ఆయన ఎవరో కాదు, క్రిష్ జాగర్లమూడి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో క్రిష్ రూపొందిస్తున్న మూవీలో అనసూయ కోసం ఓ పాత్ర సిద్ధమైందనే పొగ రాజుకుంటోంది.
మొగలాయిల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోందనే చిన్న హింట్ ఆల్రెడీ ఇచ్చేశారు. సో హిస్టారికల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోందనే విషయం కన్ఫామ్ అయిపోయింది. అరటే, ఈ సినిమాలో రంగమ్మత్తకి దక్కిన పాత్ర కూడా ఆ తరహాలోనే ఉంటుంది కదా. పల్లెటూరి మహిళగా చీరకట్టు ఎగ్గట్టి, రంగమ్మత్త పాత్రకు సుకుమార్ ప్రాణం పోస్తే, ఇక క్రిష్ మన రంగమ్మత్తని ఎలా చూపించనున్నాడో అంటూ ఆమె ఫాలోవర్స్లో ఆసక్తి నెలకొంది.