రంగమ్మత్తని మళ్లీ సుకుమారే కాపాడాలి.!

మరిన్ని వార్తలు

అప్పటి వరకూ హాటెస్ట్‌ యాంకర్‌గానే అనసూయా భరద్వాజ్‌ సుపరిచితురాలు. కానీ, 'రంగస్థలం' సినిమా తర్వాత ఆమె 'రంగమ్మత్త'గా అవతారమెత్తింది. అనసూయ కోసమే పుట్టిందన్నట్లుగా ఆ పాత్రలో అనసూయ ఒదిగిపోయింది. అంతకు ముందు చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాతా నటించింది. కానీ, అనసూయకు 'రంగమ్మత్త' పాత్ర తెచ్చినంత గుర్తింపు మరో పాత్రతో దక్కింది లేదు. ఏకంగా 16 మంది ఆర్టిస్టులను పరిశీలించి, ఆ పాత్రలో అనసూయని కూర్చోబెట్టాడు డైరెక్టర్‌ సుకుమార్‌. ఈ పాత్ర డిజైనింగ్‌లో సుకుమార్‌ విజన్‌ని అందరూ మెచ్చుకున్నారందుకే. తాజాగా అందుతోన్న సమాచారమ్‌ ప్రకారం, సుకుమార్‌ మరోసారి అనసూయకు ఛాన్సివ్వనున్నాడట.

 

సుకుమార్‌ - అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రీసెంట్‌గా సినిమా స్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్‌ మీదికెళ్లనున్న ఈ సినిమాలో మన రంగమ్మత్త కూడా నటించబోతోందట. ఆమె కోసం అలాంటి ఓ ప్రత్యేకమైన పాత్రే సుకుమార్‌ మరోసారి డిజైన్‌ చేస్తున్నాడట. ఈ సారి మన యాంకరమ్మ ఇంకాస్త ఎక్కువ టాలెంట్‌ ప్రదర్శించేసి, నటనలో విజృంభించేయాలనుకుంటోందట. అయినా, ఆ పాత్ర తెరపై అలా ఆవిష్కృతం కావడానికి అసలు సిసలు సృష్టికర్త సుకుమార్‌ కదా. ఏమో ఏదేమైతేనేం, సుకుమార్‌ పుణ్యమా అని మన రంగమ్మత్త పేరు మరోసారి మార్మోగే అవకాశాలు లేకపోలేవన్న మాట. ఇటీవల 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో సోషలిస్ట్‌ పాత్రలో కనిపించింది అనసూయ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS