పవన్ కళ్యాణ్ సినిమా అందుకే మిస్సయ్యింది

మరిన్ని వార్తలు

‘అలియాస్ జానకి’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ అనీషా ఆంబ్రోస్. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో పెద్దగా తెలీదు. కాని అనీషా పేరు పాపులర్ అయ్యింది మాత్రం పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ హీరోయిన్ గా. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం మొదట అనీషా ఆంబ్రోస్ ఎంపిక చేశారు. ఇది అందరికీ షాక్ ఇచ్చింది. అసలు అనీషా , పవన్ కళ్యాణ్ కు జోడిగా సరిపొతుందా? అనే ప్రశ్నలు వచ్చాయి. అంతకుముందు పవన్ కళ్యాణ్ - వెంకీ ల గోపాల గోపాల సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది అనీషా. ఇందులో ఆమె స్కీన్ ప్రజెన్స్ గొప్పగా ఏమీ కనిపించలేదు.

అయితే ఇంతలో ఏమైయిందో కానీ సర్దార్ గబ్బర్ సింగ్ నుండి అనీషాను తొలగించడం ఆమె స్థానంలో కాజల్ ను ఎంపిక చేయడం జరిగిపోయింది. నిర్మాత శరత్ మరార్ తో అనిషా కు ఏవో విభేదాలు రావడంతో ఆమెను ఈ సినిమా నుండి పక్కన పెట్టారని కూడా వినిపించింది. అయితే ఇప్పుడీ వ్యవహారం పై స్పదించింది అనిశా. తన లేటెస్ట్ చిత్రం  ఫ్యాషన్ డిజైనర్ ప్రమోషన్ ఈవెంట్ లో మాట్లాడిన అనిషా'' పవన్ కళ్యాణ్ గారి సినిమా ఛాన్స్ మిస్ అయినందుకు బాధగా అనిపించింది. ఆ విషయంలో తను ఎవర్నీ నిందించడం లేదు. ఆయన పక్కన మ్యాచ్ కావడం లేదనే ఫీలింగ్ వచ్చింది. అందుకే మరో ఆప్షన్ కు వెళ్లారు. అంతే తప్పితే ఎవరితో ఎలాంటి విబేధాలు లేవు'' అని క్లారిటీ ఇచ్చింది అమ్మడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS