బాలీవుడ్‌కెళ్తానంటోన్న అనుపమా.!

మరిన్ని వార్తలు

'ప్రేమమ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌. 'అ,ఆ'లో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 'శతమానం భవతి' సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి, అచ్చమైన తెలుగింటమ్మాయి అయిపోయింది. అయితే ఆ తర్వాత అనుపమా వరుసగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 'ఉన్నది ఒక్కటే జిందగీ', 'తేజ్‌ ఐ లవ్‌యూ' చిత్రాలు అనుపమకి అంతగా కలిసి రాలేదు. 

ఇప్పుడు యంగ్‌ హీరో రామ్‌తో 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమాలో నటిస్తోంది. దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగుతో పాటు అనుపమ తమిళంలోనూ మంచి చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా కన్నడలోనూ అడుగుపెట్టింది. త్వరలోనే హిందీలో కూడా తెరంగేట్రం చేస్తానని చెబుతోంది. అక్కడి నుండి అవకాశాలు వస్తున్నాయట. కానీ తన ఫస్ట్‌ ప్రిఫరెన్స్‌ మాత్రం టాలీవుడ్‌కే అంటోంది. చిన్నతనం నుండీ నటన పట్ల ఉన్న ఆశక్తి తనను హీరోయిన్‌ అయ్యేందుకు ప్రేరేపించిందట.

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అందుకు ఎంతగానో ఉపయోగపడిందని అనుపమ చెబుతోంది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమంటోంది. వరుసపెట్టి సినిమాలు చేసేసి, ఏదో మమ అనిపించేయడం కాదు, నటనలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని ఎంచుకోవడమే తన గోల్‌ అని క్యూట్‌ బ్యూటీ అనుపమా స్వీట్‌గా చెప్పేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS