నాకు న్యాయం చేయండి: నటి అపూర్వ

మరిన్ని వార్తలు

నటి అపూర్వ- చాలాకాలం నుండి తెలుగు చిత్రపరిశ్రమలో ఒక నటిగా కొనసాగుతున్నారు. ఈమధ్య కాలంలో శ్రీ రెడ్డి విషయంలో ఆమె కొన్ని టీవీ ఛానల్లో డిబేట్లకి రావడంతో ఆమె పేరు ప్రముఖంగా వినపడింది.

ఇక తాజాగా ఆమె ఆంధ్రప్రదేశ్ లోని దెందులూరు పోలీసు స్టేషన్ కి వెళ్ళడం సంచలనంగా మారింది. అపూర్వకి దెందులూరు గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉంది, అయితే ఆ భూమికి సరిహద్దు విషయంలో ఆమెకి ఆమె ప్రక్కన ఉన్న భూమి వారికి వివాదం ఏర్పడింది.

ఈ విషయమై ఆమె స్థానిక దెందులూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఫిర్యాదుని స్వీకరిస్తున్నట్లుగా తెలిపి ఇరువురికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అపూర్వని పంపించినట్టుగా తెలిపారు.

అయితే ఆమె సెలబ్రిటీ కావడం వల్లనే ఇంత చిన్న విషయం పెద్ద సంచలనం అయింది అని తెలుస్తున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS