'ముద్ర' అనే టైటిల్తో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ, అదే టైటిల్తో ఇంకో సినిమా చెప్పా పెట్టకుండా విడుదలైపోవడంతో, నిఖిల్ సినిమా టైటిల్ 'అర్జున్ సురవరంగా మారిపోయింది. టైటిల్ మార్చుకుని ఏదో అలా అలా విడుదలకు సిద్ధమయ్యాడనుకున్న తరుణంలో ఓ ఆంగ్ల సినిమా రూపంలో విడుదల పోస్ట్పోన్ అయ్యి ఇంతవరకూ విడుదలకు నోచుకోలేకపోయింది. లేటెస్ట్గా ఈ సినిమా కోసం నవంబర్ 29 రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసింది 'అర్జున్ సురవరం' చిత్ర యూనిట్.
అయితే, ఇప్పుడు వరుసగా చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఎలాగోలా వాటి మధ్య నిఖిల్కి స్పేస్ అయితే దక్కింది కానీ, ఆ టైమ్కి ఖచ్చితంగా నిఖిల్ వస్తాడా.? లేదా.? అనేది మాత్రం నమ్మలేని నిజమే. టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆసక్తికరమైన కాన్సెప్ట్తో రూపొందింది. ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి కూడా. నిఖిల్ ఈ సినిమాలో న్యూస్ ఛానెల్ రిపోర్టర్గా కనిపించనున్నాడు. నిఖిల్కి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఈ సినిమాపై నిఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే అనుకున్న టైమ్కి రిలీజ్ జరగకపోవడంతో, చాలా డిజప్పాయింట్ అయిన నిఖిల్కి తాజా రిలీజ్ డేట్ అయినా కలిసి రావాలని ఆశిద్దాం.