సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కవిత కుమారుడు సంజయ్ రూప్ కరోనా బారీన పడి.. కన్నుమూశారు. సంజయ్ కొన్ని రోజుల క్రితం కోవిడ్ బారీన పడ్డారు. అప్పటి నుంచీ హోం క్వారెంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే హఠాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రాణాలతో పోరాడుతూ మంగళవారం కన్నుమూశారు.
కవిత భర్త దశరథరాజు సైతం కరోనా బారీన పడ్డారు. ఆయన పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని సమాచారం. బాల నటిగా చిత్రరంగ ప్రవేశం చేసిన కవిత... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 300 చిత్రాల్లో నటించారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సూపర్ హిట్ చిత్రాలలో భాగం పంచుకున్నారు.