బిగ్ ఎంటర్టైనర్గా హౌస్లో గుర్తింపు తెచ్చుకున్న బాబా భాస్కర్ ఎప్పుడూ సేఫ్ గేమ్ అడుతూనే వస్తున్నాడు. ఈ సారి కూడా అదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. రాళ్లు వెనకేసుకోవడం టాస్క్లో రాహుల్, పునర్నవి, మహేష్ గేమ్ నుండి అవుట్ అవ్వగా, ఇక మిగిలిన అలీ, శివజ్యోతి, వితిక, వరుణ్, బాబా భాస్కర్లలో అలీ హయ్యెస్ట్ రేంజ్లో ఉండగా, వితికా, శివజ్యోతి తర్వాతి ప్లేస్లో ఉన్నారు.
అయితే, వరుణ్కీ, బాబా భాస్కర్కీ 50 రాళ్లు డిఫరెన్స్ ఉండడంతో, వితిక, వరుణ్కి ఆ 50 ఇవ్వడంతో బాబా భాస్కర్తో టై చేసుకున్నారు. ఆ తర్వాత వరుణ్, బాబా భాస్కర్ ఇద్దరూ పెద్దగా రాళ్లు సంపాదించినట్లు కనిపించలేదు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ దాగుంది. అప్పటికే బాబా చెప్పిన కౌంట్ రాంగ్ అని టాస్క్ అయిపోయాక తెలిసింది. వరుణ్తో బాబా భాస్కర్ టై కాలేదు. లీస్ట్ కౌంటింగ్ వరుణ్దే. అలీ తర్వాతి ప్లేస్ బాబా భాస్కర్ దక్కించుకున్నాడు. అలా 'రాళ్లే రత్నాలు' టాస్క్లో సెకండ్ ప్లేస్లో బాబా భాస్కర్ నిలిచాడు.
టాస్క్ కంప్లీట్ అయ్యాక బాబా కన్నింగ్ తెలిసొచ్చింది వరుణ్కి. ఇదే విషయాన్ని పునర్నవి, వితిక, వరుణ్ డిస్కస్ చేయగా, ఆయన కన్నింగ్ గేమ్ నేను ఎప్పుడో పసిగట్టాననీ, ఆయన్ని నువ్వు ఎలా నమ్మావనీ పునర్నవి నిలదీసింది. అంతేకాదు, పునర్నవి ఓడిపోవడానికి కూడా బాబానే కారణం అంటూ అనుమానించింది. అలా బాబా భాస్కర్ కన్నింగ్ గేమ్ స్ట్రాటజీ హౌస్ మేట్స్ మధ్య బయట పడింది.