వ‌ర్మ‌పై బాల‌య్య ఫ్యాన్స్ గ‌రం గ‌రం.

మరిన్ని వార్తలు

ఎప్పుడూ ఖాళీగా కూర్చోవ‌డం రాంగోపాల్ వ‌ర్మ‌కు అల‌వాటు ఉండ‌దు. ఎవ‌రినో ఒక‌రిని కెలికి, వార్త‌ల్లోకి ఎక్కి, కొన్నిరోజులు మ‌జా చేసి, మ‌ళ్లీ కామ్ అయిపోతుంటాడు. ఈసారి ఆయ‌న గురి బాల‌కృష్ణ‌పై ప‌డింది. బాల‌య్య‌ని టార్గెట్ చేసి, కావాల‌ని నంద‌మూరి అభిమానుల దృష్టిని త‌న వైపుకు తిప్పుకున్నాడు వ‌ర్మ‌. రాజ‌ధాని అంశంపై మండ‌లిలో హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్పుడు రోజా బాల‌య్య‌తో సెల్ఫీలు తీసుకుని, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సెల్ఫీలు చూసి నంద‌మూరి అభిమానులు ముచ్చ‌ట ప‌డ్డారు.

 

బాల‌య్య - రోజాలు ప్ర‌తిప‌క్షాలే అయినా, బాల‌య్య క్రేజ్ ముందు రోజా కూడా దాసోహం అనాల్సివ‌చ్చింద‌ని కామెంట్లు చేసుకున్నారు. అయితే ఈ ఫొటోని ప‌ట్టుకుని వ‌ర్మ - సెటైర్లు వేశాడు. ఈ సెల్ఫీలో ఆమె హీరోలా ఉన్నారు. ఆమె ప‌క్క‌న కుడివైపు ఉన్న వ్య‌క్తి చూడ‌టానికి యాక్.. ఈ ఫొటోను అత‌డి ఫేస్ స్పాయిల్ చేస్తూ ఉంది. బ‌హుశా అత‌డు ఆమెకు దిష్టి బొమ్మేమోస - అంటూ ఓ ట్వీట్ చేశాడు. అంటే.. బాల‌య్య ఎవ‌రో వ‌ర్మ‌కు తెలీదా?? తెలిసే ఈ కామెంట్ చేసుంటాడు. పైగా దిష్టి బొమ్మ‌తో పోల్చ‌డం బాల‌య్య ఫ్యాన్స్ కి ఏమాత్రం న‌చ్చ‌లేదు. దాంతో వ‌ర్మ‌పై వాళ్లు మాట‌ల యుద్ధానికి దిగిపోయారు. అయితే వ‌ర్మ ఇవ‌న్నీ ప‌ట్టించుకుంటాడా ఏంటి?? ప‌ట్టించుకుంటే వ‌ర్మ ఎందుకు అవుతాడు? ఈ ట్వీట్ వెనుక వేరే ఉద్దేశం ఏదో ఉండే ఉంటుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS