'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో మోక్షజ్ఞ.?

మరిన్ని వార్తలు

నందమూరి వారసుడు మోక్షజ్ఞకు అదిరిపోయే ఆరంగేట్రం ఇవ్వాలని గత కొన్నాళ్లుగా నందమూరి బాలయ్య యోచిస్తున్నారు. అయితే అందుకు సరైన సమయం రావట్లేదు. బాలయ్య నూరవ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' టైం నుండే మోక్షజ్ఞ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ సినిమాతో కుదరలేదు. ఆ తర్వాత 'పైసా వసూల్‌' టైంలో కూడా ఈ గాసిప్స్‌ కంటిన్యూ అయ్యాయి. అప్పుడూ కుదరలేదు. ఇక ఇప్పుడు బాలయ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ టైమొచ్చింది.

 

ఈ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందేమో అని భావించారు అభిమానులు. కానీ అలాంటిదేం లేదని చిత్ర యూనిట్‌ చెప్పింది. కానీ తాజాగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ సెట్స్‌లో మోక్షజ్ఞ సడెన్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సడెన్‌ ఎంట్రీతో మళ్లీ గుసగుసలు మొదలయ్యాయి. ఈ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా అంటూ అభిమానులు సందడి చేసేస్తున్నారు. కానీ నందమూరి నట వారసుడి ఆరంగేట్రం అంటే అంత ఆషామాషీ కాదు. సో ఈ ఊహాగానాలను నమ్మడానికి లేదంటున్నారు.

 

ఏదో క్యాజువల్‌గా సెట్స్‌ని విజిట్‌ చేయడానికే మోక్షజ్ఞ 'ఎన్టీఆర్‌' సెట్స్‌లో అడుగుపెట్టాడని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ బయోపిక్‌ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌ జరుపుకుంటోంది. బాలీవుడ్‌ నుండి విద్యాబాలన్‌, టాలీవుడ్‌ నుండి రకుల్‌ ప్రీత్‌సింగ్‌, శ్రియ, నిత్యామీనన్‌ తదితర ప్రముఖ ముద్దుగుమ్మలు నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసందే. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ బయోపిక్‌ని నెల రోజుల గ్యాప్‌లో రెండు భాగాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. సంక్రాంతికి మొదటి భాగం 'కథానాయకుడు' విడుదల కానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS